ఇద్దరు చైనీయుల మృతి
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: పాకిస్థాన్లోని కరాచీ జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో చైనా పౌరులే లక్ష్యంగా ఆదివారం జరిగిన ఉగ్రదాడిలో ఆదివారం ఇద్దరు చైనా పౌరులు మరణించగా దాదాపు 20 మందికి గాయాలైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఎయిర్పోర్టు వద్ద ఉన్న ఆయిల్ ట్యాంకర్ను ఉగ్రవాదులు పేల్చినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పేలుడు కారణంగా ఎయిర్పోర్టు ప్రాంతం మొత్తం దట్టమైన పొగ కమ్ముకున్నట్లు తెలిపారు. ఈ దాడికి తామే కారణం అని వేర్పాటువాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడి చైనా ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు హోంమంత్రి జియా ఉల్హసన్ పేర్కొన్నారు.