నిర్మల్: భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కార్గిల్ అమరవీరుల త్యాగాలను శుక్రవారం స్మరించుకోవడం జరిగింది. నిర్మల్ లో ఉన్నటువంటి విశ్రాంత ఆర్మీ ఉద్యోగులను పిలిచి వారి అనుభవాలను జ్ఞాపకాలను యువమోర్చా నాయకులకుతో కలిసి పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వొడిసెల అర్జున్ మాట్లాడుతూ... మన దేశాన్ని రక్షించడంలో సరిహద్దుల్లో అహర్నిశలు కాపలా ఉంటూ శత్రు దేశాలు మన దేశం మీద దాడి చేయకుండా ఆర్మీ జవాన్లు వారి ప్రాణాలను అర్పిస్తున్నారు. మన దేశాన్ని సంరక్షించడంలో ఆర్మీ ప్రముఖ పాత్ర వహిస్తుందని, దేశ పౌరులు కూడా ఆర్మీలో ప్రధాన పాత్ర పోషిస్తూ దేశాన్ని రక్షించడంలో యువకులు ముందుండాలన్నారు. దేశం సుభిక్షంగా ఉండాలంటే ఆర్మీతో మాత్రమే సాధ్యమని అర్జున్ తెలిపారు.