19-03-2025 12:10:41 AM
సూర్యాపేట, మార్చి18(విజయక్రాంతి): ఒకే దేశం ఒకే ఎన్నికలు నినాదంతో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు కేంద్రం సిద్ధపడుతోందని, రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్ సభకు వేర్వేరుగా ఎన్నికలు జరగడం వల్ల దేశంలో ఎప్పుడూ ఏదో ఒక ఎన్నికలు జరుగుతున్నాయని ఆ విదానాన్ని మార్చితే దేశ ప్రగతిపై ప్రభావం చూపుతుందని కేంద్రం భావిస్తుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి అన్నారు.
మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ లోక్సభ మరియు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి, ఒకే రోజున లేదా సరైన సమయంలో జరగడం వల్ల ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడం, ఎన్నికల ఖర్చు తగ్గించడం, సమయం, వనరులను ఆదా చేసుకోవచ్చని అన్నారు