మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్
యాదాద్రి భువనగిరి, జూలై 8 (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం భువనగిరిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ అధ్యక్షతన ఆలేరు, భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్ల ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలపరిచే అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు పాపారావు, సాంబయ్య, లింగస్వామి, కృష్ణ, శ్రీనివాస్, గూడూరు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.