మంథని, మే 4 (విజయక్రాంతి): దేశంలో బీజేపీకి తిరుగులేదని, 400 వందల సీట్లతో అధికారంలోకి వస్తుందని తమిళనాడు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వినోద్ సెల్వం ధీమా వ్యక్తం చేశారు. మంథని పట్టణంలో శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్రెడ్డితో కలిసి నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. దేశ ప్రజలు మళ్లీ మోదీనే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధి జరగాన్నా, బడుగూ బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నా ఓటర్లు బీజేపీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం పార్టీలో చేరిన ఖమ్మంపల్లి మాజీ సర్పంచ్ సముద్రాల రమేష్ను బీజేపీలోకి ఆహ్వానించారు. సమావేశంలో కాటారం పీఏసీఎస్ చైర్మన్ చల్లా నారాయణరెడ్డి, నాయకులు కొండపాక సత్యప్రకాష్, మల్కా మోహన్ రావు, నాంపల్లి రమేష్, బాగోజు శ్రీనివాస్ పాల్గొన్నారు.