calender_icon.png 26 October, 2024 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

12-07-2024 12:04:11 PM

హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బిజెపి) కార్యవర్గ సమావేశం శుక్రవారం శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్‌లో ప్రారంభం అయింది. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు.  బీజేపీ ఎంపీ, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్‌ కే లక్ష్మణ్‌, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, ఎంపీ ఈటల రాజేందర్‌, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు గరికపాటి మోహన్‌రావు, పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, బీజేపీ కర్ణాటక కో ఇంచార్జి, ఏవీఎన్‌రెడ్డి, బీజేపీ ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేత అల్లెటి మహేశ్వర్‌రెడ్డి పాల్గొంటారు.

బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ అధికార ప్రతినిధులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బీజేపీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, 2023, 2024 ఎన్నికల్లో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులు, బీజేపీ పార్లమెంట్ ప్రభరీలు, కన్వీనర్, జాయింట్ కన్వీనర్లు, అసెంబ్లీ ప్రభరీలు, కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి సెల్ కన్వీనర్, జాయింట్ కన్వీనర్లు, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ఎంపిలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, బిజెపి రాష్ట్ర స్థాయి మోర్చా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు, ప్రత్యేక ఆహ్వానితులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.