calender_icon.png 8 October, 2024 | 6:01 PM

Breaking News

భాజపా ప్రాథమిక సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

08-10-2024 04:07:55 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు పార్టీ శ్రేణులకు సూచించారు. మంగళవారం కౌటాల మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో బిజెపి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని దేశంలోనే బిజెపి పార్టీ సభ్యత్వం మొదటి స్థానంలో ఉండేలా క్షేత్రస్థాయిలో ప్రతి కార్యకర్త పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు వాను పటేల్, సభ్యత్వ నమోదు కార్యక్రమ ఇన్చార్జి ఎల్ములే మల్లయ్య, మండల ప్రధాన కార్యదర్శి మిథున్ కవిరాజ్, సత్తయ్య, భీమన్న, బండురావు, తిరుపతి గౌడ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.