ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం విడుదల చేసింది. మూడో జాబితా ప్రకటనతో ఇప్పటి వరకు మొత్తం 146 మంది అభ్యర్థులను కమలదళం ప్రకటించింది. ఇందులో మొదటి జాబితా నుండి 99 మంది అభ్యర్థులు, రెండవ జాబితా నుండి 22 మంది అభ్యర్థులు ఉన్నారు. నాందేడ్ ఎంపీ స్థానం ఉప ఎన్నికలకు సంతుక్ మారోత్ రావ్ హంబర్డే పేరు ఖరారు చేసింది. మహాయుతి కూటమిలో సీట్ల పంపకాల ఏర్పాటులో భాగంగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాల్లో 151 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఎన్నికల నిర్వహించనుండగా, 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.