calender_icon.png 15 October, 2024 | 6:52 PM

దేశానికి బిజెపి పార్టీ రక్ష

15-10-2024 04:50:12 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): దేశ ప్రజలకు బిజెపి పార్టీ రక్షణ కవచంలా ఉంటుందని అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. మంగళవారం రెబ్బెన మండలం నార్లాపూర్ గ్రామంలో నిర్వహించిన బిజెపి పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు అరిగెల నాగేశ్వరరావుతో కలిసి అదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు గోడం నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నడుస్తుందని, పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా అందరూ స్వచ్చంధంగా ప్రాథమిక సభ్యత్వ నమోదులో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి బిజెపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూట్ మెంబర్ కృష్ణ కుమారి, అసెంబ్లీ కన్వీనర్ సొల్లు లక్ష్మి, అసెంబ్లీ కో కన్వీనర్ కిరణ్, రెబ్బెన మండలాధ్యక్షుడు తిరుపతి, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ చక్రపాణి, గ్రామస్తులు నాయకులు, తదితరులు పాల్గొన్నారు.