calender_icon.png 21 September, 2024 | 4:37 PM

బీజేపీ సభ్యత్వ నమోదు

21-09-2024 01:25:13 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): యాదగిరిగుట్ట మండలం లప్ప నాయక్ తండా గ్రామపంచాయతీలో శనివారం భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యశాల గ్రామ శాఖ అధ్యక్షులు ధీరావత్ మధు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు అజ్మీర్ కిషన్ నాయక్ మండల అధ్యక్షులు గుంటుపల్లి సత్యనారాయణ పాల్గొని భారతీయ జనతా పార్టీ సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు శ్రీను నాయక్ రాజు మధు నాయక్ శ్రీధర్ నాయక్ బాలు నాయక్ గణేష్ నాయక్ సుధాకర్ నాయక్ దేవేందర్ నాయక్ రవి నాయక్ మనమ్మ జ్యోతి ప్రమీల లాలమ్మ తదితరులు పాల్గొన్నారు