కూల్చివేతలు లేని మూసీ పునరుజ్జీవమే లక్ష్యం
హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి): మూసీ పునరుజ్జీవం వల్ల ఏ ఒక్క రూ ఇంటిని కోల్పోయే పరిస్థితి రావొద్దని బీజేపీ నేతలు అన్నారు. మూసీలో కూల్చివేతలకు గురయ్యే 11వేల మంది తరఫున ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. ఇందు లో భాగంగా ౩ రోజులుగా మూసీ పరివాహక ప్రాంతాల్లోని స్థానికుల సమస్యలు విన్నామన్నారు. వారిలో భరోసా కల్పించేందుకు బాధితులతో కలిసి శుక్రవారం ఇంది రాపార్క్ వద్ద మహా ధర్నా చేయనున్నట్లు నేతలు తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రమం లో పెద్ద ఎత్తున మూసీ బాధితులను భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నామ న్నారు. కూల్చివేతలు లేని పునరుజ్జీవమే తమ ధ్యేయమని పునరుద్ఘాటించారు. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పాల్గొంటారని వివరించారు.