22-04-2025 12:00:00 AM
వారాసిగూడ, ఏప్రిల్ 21(విజయక్రాంతి) : బిజెపి బౌద్ధ నగర్ డివిజన్ ముఖ్య నాయకుల సమావేశం డివిజన్ బిజెపి అధ్యక్షులు సాయి ప్రసాద్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. బిజెపి మహంకాళి జిల్లా కార్యదర్శి రామ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొనగా డివిజన్ కు సంబంధించిన సంస్థాగత విషయాలు అదేవిధంగా డివిజన్ అన్ని మోర్చాల యొక్క కమిటీలను ఏర్పాటు చేయవలసిందిగా దీనికి సంబంధించి ముఖ్య నాయకుల యొక్క పేర్లను రామిరెడ్డికి అందజేయడం జరిగింది.
అందులో పొందపరచిన పేర్లలోని వారిని బిజెపి మరియు అన్ని అనుబంధ సంస్థలకు నియమించుకోవడం జరుగుతుందని జిల్లా కార్యదర్శి రామిరెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు సంపత్ కుమార్ సుధాకర్ శ్యాంసుందర్ సాయి ప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.