calender_icon.png 29 September, 2024 | 6:57 AM

ఈడీ దాడులకు బీజేపీకి సంబంధం లేదు

28-09-2024 01:21:19 AM

ఎంపీ రఘునందన్‌రావు 

ఖమ్మం, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు పేర్కొన్నారు. ఖమ్మంలో శుక్ర వారం జరిగిన పార్టీ ఎన్నికల  సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రిపై ఈడీ దాడులకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. తప్పు చేస్తే ఈడీ దాడులు తప్పవని, చట్టం ముందు అంతా సమానమేనని పేర్కొన్నారు.

ఏపీ మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి గుడి ప్రవేశ డిక్లరేషన్‌కు బీజేపీకి కూడా ఎలాంటి సంబంధం లేదన్నారు. దళితులను ఈ పంచాయితీలోకి లాగొద్దన్నారు. హైడ్రాను స్వాగతిస్తున్నామని, ఈ విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రఘునందన్‌రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యామ్‌రాథోడ్, నున్నా రవికుమార్,  అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, విజయారెడ్డి తదితరులు పాల్గొన్నారు.