06-04-2025 08:00:50 PM
పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావుతో కలిసి ధోని శ్రీశైలం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రవేశపెడుతున్న సంక్షేమ, అభివృధి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. రానున్న కాలంలో తెలంగాణలో భాజపా పార్టీ అధికారంలోకి రావడం కాయం అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులు స్వీట్స్ తినిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరిగిల మల్లికార్జున్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షులు సుంకరి పెంటయ్య, ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాటురీ జయరాజ్, నాయకులు ప్రసాద్ గౌడ్, దీపక్ రావ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.