28-04-2025 12:13:31 AM
కామారెడ్డి టౌన్, ఏప్రిల్ 27: ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన్ కీ బాత్ 121వ సంచిక కార్యక్రమం భాగాన్ని కామారెడ్డిలో ఆదివారం కామారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నీలం చిన్న రాజులు వీక్షించారు.12వ వార్డులోని బూత్ నెంబర్ 198 లో కార్యక్రమాన్ని తిలకించారు.
ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించిన వారిలో రాష్ర్ట కిసాన్ మోర్చా సభ్యులు తుమ్మ బాలకిషన్ , తేలు స్వామి, కామారెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు చిన్నోళ్ల రజనీకాంత్ రావు ,198 బూత్ అధ్యక్షులు పెద్దోళ్ల గోపాల్ రావు , రామకృష్ణ , 10 వార్డు ఇంచార్జి కాసర్ల రవీందర్ రావు, కామారెడ్డి పట్టణ ఓబిసి ప్రధాన కార్యదర్శి కనకుంట గోవర్ధన్ ,దొడ్ల స్వామి, సరికొండ ప్రభాకర్ , కంటలే రజినీకాంత్ ,శ్రీకాంత్ ,కిరణ్ బిజెపి నాయకులు, కార్యకర్తలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.