calender_icon.png 21 October, 2024 | 12:42 AM

బీజేపీ 'డర్టీ పాలిటిక్సే' కారణం: ఢిల్లీ సీఎం అతిషి

20-10-2024 04:30:09 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): ఢిల్లీలో పెరుగుతున్న వాయు, నీటి కాలుష్యానికి బీజేపీ 'మురికి రాజకీయాలే' కారణమని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి ఆదివారం పేర్కొన్నారు. శీతాకాలం ప్రారంభంతో దేశ రాజధానిలో గాలి నాణ్యత క్షీణించడం ప్రారంభించింది. అయితే వివిధ ప్రదేశాలలో, ముఖ్యంగా కాళిండికుంజ్ వద్ద యమునా నది ఉపరితలంపై విషపూరిత రసాయన నురుగు మందపాటి పొరలు కనిపిస్తున్నాయన్నారు. ఆప్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్‌కు అతిషి క్లీన్ చిట్ ఇచ్చారు.ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉండటానికి బీజేపీ పాలిత హర్యానాలో 'పరాలీ' (వరి పొట్టు) దహనం, డీజిల్ బస్సులు, ఇటుక బట్టీలను అని మండిపడ్డారు. యుపీ నుండి ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దులోని కౌశాంబి బస్ డిపోకు వేల సంఖ్యలో డీజిల్ బస్సులు చేరుకుంటాయి. ఎన్‌సిఆర్‌లోని ఇటుక బట్టీలు, ఈ ప్రాంతంలోని థర్మల్ ప్లాంట్లు కూడా ఢిల్లీలో వాయు కాలుష్యానికి కారణమయ్యాయని ఆమె ఆరోపించారు.

యమునా నదిలో పారిశ్రామిక వ్యర్థజలాలు శుద్ధి చేయని కారణంగానే ఢిల్లీలోని యమునా నదిపై నురుగు కనిపించిందని ఢిల్లీ ముఖ్యమంత్రి బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. హర్యానా రోజుకు 165 మిలియన్ గ్యాలన్ల (ఎంజీడీ) పారిశ్రామిక శుద్ధి చేయని వ్యర్థ జలాలను బాద్‌ షాపూర్, ముంగేష్‌ పూర్, ఇతర కాలువల ద్వారా యమునాలోకి విడుదల చేస్తుంది. అయితే 65 ఎంజీడీ కలుషిత నీటిని యుపీ వివిధ కాలువల ద్వారా నదిలోకి విడుదల చేస్తుందని ఆమె చెప్పారు. "ఢిల్లీలో పెరుగుతున్న వాయు, నీటి కాలుష్యానికి బీజేపీ మురికి రాజకీయాలు కారణమన్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ నగర ప్రజలకు సహాయం చేయడానికి కట్టుబడి ఉంది" అని ఆమె అన్నారు.

2021లో 71,300గా ఉన్న వ్యవసాయ మంటలను 2023లో 36,600కి పంజాబ్ తగ్గించిందని కేంద్ర ప్రభుత్వ డేటా చూపించిందని అతిషి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా, ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డేటా అక్టోబర్ 1 నుంచి 15 మధ్య పంజాబ్‌లో 2023లో 1105 నుండి 811 వరకు 27 శాతం తగ్గుదల నమోదైందని అతిషి సూచించారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది హర్యానాలో 341 నుంచి 417కు పెరిగాయని, యూపీలో గత ఏడాదితో పోలిస్తే అక్టోబర్ 1 నుంచి 15 మధ్య కాలంలో ఈ సంఖ్య 244 నుంచి 417కి పెరిగిందని ఢిల్లీ ముఖ్యమంత్రి తెలిపారు. ఇది బీజేపీ డర్టీ రాజకీయాలను స్పష్టంగా చూపిస్తుందన్నారు. పంజాబ్ ప్రభుత్వం పారలీ దహనాన్ని తగ్గించగలిగితే, హర్యానా, యుపీలోని బీజేపీ ప్రభుత్వాలు ఎందుకు చేయలేవు?" అని ప్రశ్నించారు. యమునా ఉపరితలంపై నురుగు పొరను తగ్గించేందుకు ఆదివారం రాత్రి నుంచే సిలికాన్ ఆధారిత డీఫోమర్ల వినియోగం ప్రారంభమవుతుందని అతిషి పేర్కొన్నారు.