30-04-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 29 : అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు దార కళ్యాణి ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్, మున్సిపల్, ఆర్డీవో కార్యాలయాల ముందు బిజెపి శ్రేణులు ధర్నా చేశాయి. ఈ సందర్భంగా నాయకులు బీజేపీ నాయకులు మాట్లాడుతూ బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులలో అర్హులైన నిరుపేద కుటుంబాలు ఉన్నాయన్నారు.
అనర్హు లు ఎవరు ఉన్న వాళ్ల పేర్లు తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, జిల్లా కార్యదర్శి కోయల్కర్ గోవర్ధన్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోడి రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, సీనియర్ నాయకులు జీదుల రాములు ఏల్పుల రాజయ్య,
ఎస్సీ మోర్చా కార్యదర్శిలు కోడి సురేష్ కల్లెపల్లి నవీన్, ఎస్సీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ముడిమడుగుల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షులు ఉప్పులేటి స్రవంతి,పట్టణ కార్యదర్శి సల్లం సుమలత, నాయకులు కుని రాజుల అరవింద్, ఎర్రోజు శ్రీనివాస్ చింతకింది లావణ్య, షేక్ గౌస్ బాబా పాల్గొన్నారు.