మాజీ మంత్రి సహా ఏడుగురి బహిష్కరణ
హర్యానా, సెప్టెంబర్ 29: హర్యానాలో ఎన్నికల వేళ తిరుగుబాటు నేతలపై బీజేపీ బహిష్కరణ వేటు వేసింది. మాజీ మంత్రి రంజిత్ చౌతాలాతో సహా మరో ఏడుగురిని పార్టీ నుంచి ఆరేళ్ల పాటు తొలగిస్తున్నట్లు స్పష్టంచేసింది. సొంత పార్టీ నేతలపై పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ హర్యానా చీఫ్ మోహన్లాల్ బదోలి ఓ ప్రకటనలో తెలిపారు. హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఆక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.