04-03-2025 11:52:11 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో మంగళవారం దోమకొండ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మాజీ సిడిసి చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఐరేణి నరసయ్య పుట్టినరోజు సందర్భంగా ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. వారికి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్లు తినిపించారు. ఈ జన్మదిన వేడుకల్లో దోమకొండ మాజీ జడ్పిటిసి తీగల తిరుమల గౌడ్, వారి వెంట అల్లే రవి, ముధం శివ శంకర్ పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.