05-03-2025 09:08:55 PM
రాజంపేట (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఎల్లాపూర్ తండా నుంచి అక్రమంగా నిలువ చేసిన ఇసుకను తరలిస్తున్న సమాచారంపై రాజంపేట పోలీస్ స్టేషన్ అధికారులు ఒక టిప్పర్ ఐదు ట్రాక్టర్లపై కేసు నమోదు చేసి వారందరినీ బుధవారం తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా చట్టంకు వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా ఇసుక ఎగుమతి దిగుమతి చేసినచో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని రాజంపేట ఎస్సై పుష్పరాజ్ తెలియజేశారు.