calender_icon.png 24 September, 2024 | 7:55 PM

బాలానగర్‌లో బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ హత్య

16-09-2024 01:01:49 PM

హైదరాబాద్: బాలానగర్‌లో సెప్టెంబర్ 14న గుర్తుతెలియని వ్యక్తులు ఓ వ్యక్తిపై దాడి చేసి హత్య చేశారు. మృతుడి కొత్తగూడెం జిల్లాకు చెందిన కె. దినేష్‌ (32) గా గుర్తించారు. దినేష్ బాలానగర్‌లో నివాసముంటూ బైక్‌ ట్యాక్సీ డ్రైవర్‌ గా పనిచేస్తూ జీవిస్తున్నాడు.  దినేష్ అతని భార్య జ్యోతి ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. శనివారం ఉదయం దినేష్ బైక్‌ ట్యాక్సీ ఉద్యోగానికి వెళ్లి రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. 

ఆదివారం తెల్లవారుజామున, జ్యోతి తన భర్త మృతదేహాన్ని ఐడిపిఎల్ కంపెనీకి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో పడి ఉందని స్థానికులు సమాచారం అందించారు. ఆమె సంఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. సమాచారం మేరకు బాలానగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కొందరు వ్యక్తులు దినేష్‌పై దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలపాలై మరణించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.