ఏటురూనాగారం: ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 163 జాతీయ రహదారిపై చిన్నబోయినపల్లి నుంచి ఏటురూనాగారం వైపు వస్తున్న ద్విచక్ర వాహన దారునిపై భారీ వృక్షం కూలి పడింది. ఈ ప్రమాదంలో వాహన దారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవపరీక్ష నిమిత్తం ఏటురునాగారం సామాజిక ఆసుపత్రికి తరలించి, వృక్షాన్ని తొలగించారు. ఈ ఘటన మెయిన్ రోడ్డుపై జరగడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మృతుడు చిన్నబోయినపల్లి గ్రామానికి చెందిన జాంగిర్ గా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసుల పేర్కొన్నారు.