కొడిమ్యాల: జగిత్యాల జిల్లాలో కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో బీరప్ప దేవాలయం సమీపంలో అదే గ్రామానికి చెందిన కందుల రాజశేఖర్ (30) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ నీలం రవి, ఎస్సై సందీప్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.