calender_icon.png 11 October, 2024 | 4:56 AM

బైక్ అదుపుతప్పి ఒకరి మృతి

09-10-2024 12:00:00 AM

మహదేవపూర్, అక్టోబర్ 8: బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన గల గుంతలో పడి యువకుడు మృతిచెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని యమనపల్లి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగింది. కాటారం గ్రామనికి చేందిన సింగణవేణి సుందర్(22) మహాముత్తారం నుంచి బైక్‌పై వస్తుండగా యమనపల్లి వద్ద అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి గుంతలో పడింది. దీంతో సుందర్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.