ఏడుగురు షూటర్లను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీస్
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు బెదిరింపుల నేపథ్యంలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు సంబంధించిన మూలాలపై పోలీసులు దృష్టి సారించారు. ఇందులో భాగంగా బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఏడుగురు షూటర్లను ఢిల్లీ పోలీస్ స్పెషల్ స్వాడ్ అరెస్టు చేసింది. అలాగే బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ గురించి సమాచారం ఇచ్చిన వారికి రూ.10లక్షల రివార్డు ప్రకటించింది. బాబా సిద్ధిఖీ హత్యానంతరం మరోమారు బిష్ణోయ్, అతడి గ్యాంగ్ దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది. ఈనేపథ్యంలో బిష్ణోయ్ గ్యాంగ్పై దృష్టిసారించిన పోలీసులు.. వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు షూటర్లను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.