మాదాపూర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు
శేరిలింగంపల్లి, అక్టోబర్ 5 (విజయక్రాంతి): సినీ హీరో నాగా ర్జునకు ఎదురుదెబ్బ తగిలింది. తమ్మిడికుంట చెరువును నాగార్జున కబ్జాచేసి అక్రమంగా ఎన్ కన్వెన్షన్ను నిర్మించినట్టు రెవె న్యూ అధికారులు కూడా నిర్థారించారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని.. జనంకోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అలాగే చెరువును పునరుద్ధరించడానికి అయ్యే ఖర్చును కూడా ఆయన వద్ద నుండే వసూలు చేయాలని కోరారు. అయితే లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని మాదాపూర్ పోలీసులు స్పష్టంచేశారు.