calender_icon.png 23 September, 2024 | 1:55 PM

చందమామపై భారీ బిలం గుర్తింపు

23-09-2024 11:20:12 AM

చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ ను దింపిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రాసెక్టులో భాగంగా విక్రమ్ లా్యండర్ తో పాటు ప్రగ్యాన్ రోవర్ ను ఇస్రో చంద్రుడి పైకి పంపింది.చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన తర్వాత ప్రగ్యాన్ రోవర్ అక్కడి పరిస్థితిని ఫోటోలు తీసి పంపించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి కొద్ది దూరం పాటు ప్రయాణించి చుట్టు పక్కల ప్రాంతాలను ఎక్స్ ప్లోర్ చేసింది. ఈ క్రమంలో భారీ బిలంను గుర్తించింది. ల్యాండ్ అయిన ప్రదేశాన్ని దాని చుట్టు పక్కల ప్రాంతాలను ప్రగ్యాన్ రోవర్ కు పంపగా విక్రమ్ ల్యాండర్ కు పంపగా .. విక్రమ్ వాటిని ఇస్రోకు చేరవేసింది. 160 కిలో మీటర్లు మేర విస్తరించి ఉన్న ఈ బిలం చాలా కాలం కిందటే ఏర్పడిందని ఇస్రో శస్త్ర వేత్తలు అంచనా వేశారు.

సాధారణంగా అగ్ని పర్వతం బద్దలైనపుడు ఇలాంటి బిలాలు ఏర్పడతాయని చెప్పారు.  చంద్రుడి సౌత్ పోల్ కు సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఈ బిలం ఉందని వివరించారు. కాగా, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా ల్యాండైన విక్రమ్, అందులో పంపిన ప్రగ్యాన్ రోవర్ ప్రస్తుతం స్లీపింగ్ మోడ్ లో ఉన్నాయి.

అక్కడ రాత్రి సమయం దాదాపు మనకు పద్నాలుగు రోజులు.. ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ కు పడిపోతాయని, ఆ ఉష్ణోగ్రతలో విక్రమ్ ల్యాండర్, ప్రగ్యాన్ రోవర్ లు పనిచేయలేవని సైంటిస్టులు వివరించారు. వాటి బ్యాటరీలు పూర్తిగా డ్రై అయిపోయాయని వివరించారు. ప్రస్తుతం అవి రెండూ చంద్రుడిపై నిద్రిస్తున్నాయని సైంటిస్టులు చెప్పారు.