calender_icon.png 23 October, 2024 | 3:03 PM

ఘనంగా బోనాలు

22-07-2024 03:08:04 AM

బీబీపేటలో ఊర పండుగ 

దోమకొండలో మహంకాళి జాతర 

కామారెడ్డి, జూలై 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఆషాఢమాస బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కామారెడ్డి క్రేడా సంఘం అధ్వర్యంలో మైసమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల రోజునే దోమకొండలో కూడా మహంకాళి అమ్మవారి జాతర నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ప్రతీ ఏడాది మహారాష్ట్ర, సూరత్, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. దోమకొండలో మహంకాళీ జాతరకు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఆషాఢమాస బోనాలను ఘనంగా జరుపుకున్నారు.