- మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
- ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం
పాలేరు, ఆగస్టు 11: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పరిధిలోని గ్రామాల నుంచి అప్పర్ ప్రమైరీ స్కూల్కు ఇతర గ్రామాలకు వెళ్లే విద్యార్థులకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు. ఆదివారం సాయంత్రం పాలేరు నియోజకర్గ పరిధిలోని కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాలేజీ ప్రిన్సి పాల్స్తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.ప్రతి పాఠశాలకు ఆర్వో వాటర్ ప్లాంటు ఏర్పాటు, విద్యార్థులకు ఆరోగ్యపరమైన ఖర్చులను సైతం భరిస్తామ న్నారు. నాణ్యమైన, క్రమశిక్షణ కల్గిన చదువును పిల్లలకు అందించాలని ఉపాధ్యా యులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలన్నారు. సమీక్షా సమావేశంలో పాలేరు నియోజకర్గ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కాలేజీ ప్రిన్సిపాళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.