26-04-2025 01:00:31 AM
సూర్యాపేట, ఏప్రిల్ 25: ఈనెల 27 న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సూర్యాపేట మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కీసర వేణుగోపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నాయకులు , కార్యకర్తలతో సైకిల్ యాత్రగా బయలుదేరారు.
ఈ కార్యక్రమంలో గాలి సాయికిరణ్, వెన్న రవితేజ రెడ్డి, మంద కమలాకర్, దొనకొండ నరేష్, కొమ్మ ప్రవీణ్, గోనె అశోక్, రుద్రారపు నాగరాజు, రాకురి సైదులు, ప్రభాకర్, శివరామకృష్ణ, గణేష్, గట్టు సాయి, దేశ గాని శ్రీనివాస్ గౌడ్, శిగ గణేష్, తదితరులు పాల్గొన్నారు.