calender_icon.png 25 October, 2024 | 9:51 AM

నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ భూమి పూజ

28-08-2024 12:35:02 AM

11 గంటలకు సచివాలయంలో అట్టహాసంగా కార్యక్రమం

మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయ క్రాంతి): డా.బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు బుధవారం ఉదయం 11 గంటలకు అట్టహాసంగా భూమి పూజ జరగనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. భూమి పూజ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే సచివాలయంలో చూసిన ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనున్నదని స్పష్టం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విధంగానే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభముంటుందని తెలిపారు.