calender_icon.png 23 April, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులకు భూ భారతితో పరిష్కారం

23-04-2025 01:05:40 AM

నాగారం రైతు వేదికలో భూ భారతి చట్టం అవగాహనలో కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంథని ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): నూతన ఆర్వోఆర్ చట్టం భూ భారతి తో  పెండింగ్ సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయని  జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం కమాన్ పూర్ మండలంలోని నాగారం రైతు వేదిక వద్ద నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ డి.వేణుతో  కలిసి  పాల్గొన్నారు.

భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టంలోప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు.

పిఓటి, ఎల్.టి.ఆర్, సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్ధీకరణ చేసే నాటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు , 100 రూపాయల అపరాధ రుసుం వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని, హక్కుల రికార్డులు వివరాలను నమోదు చేసి పాసు బుక్ జారీ చేస్తారని, రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని, నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు.

అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టు వెళ్ళవచ్చన్నారుప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురెష్ , కమాన్ పూర్ తహసిల్దార్ వాసంతి, రైతులు, వివిధ వర్గాల ప్రజలు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.