02-03-2025 07:08:39 PM
పాల్వంచ (విజయక్రాంతి): స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు జైభీమ్ రవీందర్ స్వేరో ఆధ్వర్యంలో ముఖ్యఅతిథి స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షులు చిలకబత్తిని వీరయ్య స్వేరో చేతుల మీదగా భీమ్ దీక్ష పోస్టర్ ఆదివారం పట్టణంలోని పూర్ణ టీ స్టాల్ వద్ద ఆవిష్కరణ చేశారు. అనంతరం జిల్లా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ... మార్చి 15న గౌరవ మాన్యవర్ కాన్షీరాం జయంతిని పురస్కరించుకొని మహనీయులను స్మరించుకునే దీక్ష వేడుకల్లో భాగంగా భీమ్ దీక్ష ప్రారంభ సభను నేలకొండపల్లి బౌద్ధ స్తూపం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి స్వేరోస్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిధిగా వస్తున్నారు. కావున జిల్లాలోని స్వేరోస్, ఆర్ఎస్పీ అభిమానులు, ప్రతి పల్లె, ప్రతి ఇల్లు కదిలి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ స్వేరోనాయకులు కొత్తపల్లి శ్రీనివాస్ స్వేరో, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు మంజూర్ అలీఖాన్, తెలంగాణ ఉద్యమకారుడు ఇజ్జగాని రవి, కాంగ్రెస్ పార్టీ ST సెల్ జిల్లా కార్యదర్శి దేవి లాల్ నాయక్, సీనియర్ స్వేరోనాయకులు శేషు, లాయర్ అశోక్, జిల్లా స్వేరోస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.