calender_icon.png 11 October, 2024 | 3:47 PM

విద్యుత్ బిల్లులు కట్టనక్కర్లేదు: ఉప ముఖ్యమంత్రి

11-10-2024 01:44:11 PM

సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిదేది లేదు

ప్రపంచంతో పోటీపడే విద్యా విధానాన్ని తీసుకువస్తాం

హైదరాబాద్: ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యుత్ బిల్లులు కట్టనక్కర్లేదని, విద్యాసంస్థల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ... అన్ని వర్గాల కోసం విద్య బుద్ధులు నెర్పేందుకు నాంది పలికామన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకెళ్తున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తామని చెప్పారు. ప్రపంచంలో పోటీపడే విద్యా విధానాన్ని పొందుపరుస్తామని వెల్లడించారు. ఈ ఏడాది సమీకృత గురుకులాలకు రూ. 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిదేది లేదని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికి గురుకుల భవనాలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. గురుకుల పాఠశాలల్లో సకల సౌకర్యాలు పొందుపరుస్తున్నామని ఆయన తెలిపారు. అన్ని వర్గాల కోసం విద్యా బుద్ధులు నేర్పేందుకు నాంది పలికామన్నారు. ప్రభుత్వ విద్యా విధానం నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.