calender_icon.png 14 October, 2024 | 8:50 AM

కనుల పండువగా భద్రకాళి భద్రేశ్వరుల కల్యాణం

14-10-2024 04:04:38 AM

హనుమకొండ, అక్టోబర్ 13(విజయక్రాంతి): వరంగల్ భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం ఆదివారం కనుల పండువగా జరిగింది. దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో జరిగిన వేడుకకు పెద్దసంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కల్యాణం అనంతరం భక్తులకు  అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.

దేవీ శరన్నవ రాత్రోత్సవాల్లో భాగంగా పదిరోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. విజయదశమి పర్వదినాన శనివారం తెప్పొత్సవంతో శరన్నవ రాత్రి ఉత్సవాలు ముగిసాయి. మరుసటి రోజు ఆదివారం ఉదయం భద్రకాళీ భద్రేశ్వరుల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు.  వేడుకలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీజీఎస్‌ఎన్‌డీసీల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.