ముగిసిన నవరాత్రి ఉత్సవాలు
జూలై 21 (విజయక్రాంతి) : వరంగల్ భద్రకాళి అమ్మవారి శాకాంబరి నవరాత్రి ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. చివరిరోజు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరిగా అలకంరించారు. 500 కిలోల కూరగాయలు, పండ్లను దండలుగా చేసి అలంకరణ చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వర్షంలో సైతం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.