calender_icon.png 22 October, 2024 | 11:15 PM

అవమానాలను దాటి.. అన్యాయాన్ని ఎదిరిస్తూ..

22-07-2024 02:33:52 AM

నరబలుల పేరిట జరుగుతున్న హత్యలు పోలీసులకు సవాలు విసురుతుంటే.. అదే శాఖలో ఉంటూ కేసులను ఛేదిం చే ప్రయత్నాల్లో ఉన్న బృంద పురుషులైన అధికారుల నుంచి అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో సస్పెన్షన్ వేటుకు కూడా గురైంది. ఆమె కథ ఏమిటి? ఆ నరబలుల కేసు ఎలా పరిష్కారమైంది? తెలియాలంటే ‘బృంద’ని కలుసుకోవాల్సిందే అంటున్నారు కథానాయకి త్రిష. ఆమె నటిస్తున్న మొట్ట మొదటి ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా విడుదలైంది.

ఇందులో ఆమె అవమానాలు దాటి.. అన్యాయాన్ని ఎదిరించే పోలీస్ అధికారిగా కనపడనున్నారు. సూర్య మనోజ్ వంగాల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆగస్టు 2 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కానుంది. ఇంద్రజిత్ సుకుమారన్, జయప్రకాష్, ఆమని, రవీంద్ర విజయ్, రాకేందు మౌళి తదితరులు నటించిన ఈ సిరీస్ తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లోనూ లభ్యం కానున్నట్టు మేకర్స్ తెలిపారు. దర్శకుడితో పాటు పద్మావతి మల్లాది స్క్రీన్ ప్లే సమకూర్చిన ఈ చిత్రానికి దినేష్ కె బాబు, శక్తికాంత్ కార్తీక్, అవినాష్ కొల్ల, అన్వర్ అలీ సాంకేతిక విభాగాల్లో పనిచేశారు.