calender_icon.png 8 September, 2024 | 8:44 AM

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలి

27-07-2024 12:45:07 PM

బెల్లంపల్లి (విజయ క్రాంతి): రక్తదానం చేసి ప్రతి ఒక్కరు ప్రాణదాతలు నిలవాలని బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ అన్నారు. శనివారం పట్టణంలోని తాపీ మేస్త్రి భవనంలో జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. తల సేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల సహాయార్థం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవాసమితి అధ్యక్షులు ఆడెపుసతీష్, ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి,గౌరవ సలహాదారులు దాసరి సత్యనారాయణ గౌడ్, నిచ్చకోల రాజన్న, బాలాజీ, కార్యనిర్వాహక అధ్యక్షులు కాంపెల్లి విజయ్ కుమార్, సహా కార్యదర్శులు దాసరి రంజిత్ గౌడ్, శ్రీనివాస్, కుమార్ లతో పాటు మహిళా సభ్యురాలు హనుమాండ్ల రమాదేవిలు పాల్గొన్నారు