calender_icon.png 17 October, 2024 | 5:33 PM

దోస్తుతో గొడవ వల్లే..

17-10-2024 01:30:20 AM

ముంబై, అక్టోబర్ 16: బాంబు బెదిరింపు సందేశాలతో విమానయాన సంస్థలను పరుగులు పెట్టించిన ఘటనలో విస్తుపోయే విషయం బయటపడింది. ఓ బాలుడు తన మిత్రుడితో ఏర్పడిన గొడవ కారణంగా అతడిని ఇబ్బందుల్లో పడేసేందుకే ఎయిర్‌లైన్ సంస్థలకు బాంబు బెదిరింపు సందేశాలు పంపినట్లు పోలీసులు గుర్తించారు. సోమ, మంగళవారాల్లో బాంబు బెదిరింపు సందేశాల కారణంగా అనేక విమానాలను అత్యవసరంగా దించేయాల్సి వచ్చిం ది.

ఈ అలజడికి కారణమైన 17 ఏండ్ల బాలుడు ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ వాసిగా గుర్తించారు. అతడిని బుధవారం ముంబై పోలీ సులు అదుపులోకి తీసుకొన్నారు. తనతో గొడవ పెట్టుకొన్న స్నేహితుడి పేరుతో ఎక్స్ ఖాతా తెరిచి ఈ పని చేసినట్లు గుర్తించారు.