అరటి పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అరటి పండులో ఉండే లాభాలు అన్నీ.. ఇన్నీ కావు. కేవలం ఆరోగ్యపరంగానే కాకుండా.. ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అరటి పండుతో చర్మ, జుట్టు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చర్మ సమస్యలను దూరం చేయడంలో అరటి పండు చక్కగా పని చేస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి.
అరటిలో విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఉంటాయి. అరటి పండు చర్మానికి ఉపయోగించడం వల్ల మచ్చలు, ముడతలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. ఇందులో ఉండే పోషకాలు.. చర్మాన్ని మృదువుగా, హైడ్రేట్గా ఉంచుతాయి. అరటి పండుతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్స్ గురించి తెలుసుకుందాం..
అరటి పండు-తేనె: ఒక గిన్నెలో అరటి పండు గుజ్జు, కొద్దిగా తేనె కలిపి.. చర్మంపై రాయడం వల్ల చర్మానికి సహజంగా మెరుపు వస్తుంది. చర్మానికి తేమ అనేది చాలా అవసరం. స్కిన్ హైడ్రేట్గా ఉంటే మెరుస్తూ ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ని ఓ పావుగంట సేపు ఉంచి తర్వాత నీటితో కడిగేయాలి.
అరటి పండు-పెరుగు: అరటి పండు, పెరుగు కాంబినేషన్ కూడా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహయం చేస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ అప్లు చేయడం వల్ల ముఖంపై ఉండే జిడ్డు, మచ్చలు తొలగిపోతాయి. చర్మం మృదువుగా, హైడ్రేట్గా మెరుస్తూ ఉంటుంది. ఈ ప్యాక్ కూడా 10-15 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో శుభ్రంగా కడిగితే సరిపోతుంది.
అరటి పండు-నిమ్మరసం: నిమ్మకాయ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయ పడుతుంది. అరటి పండు గుజ్జులో కొద్దిగా నిమ్మరసం పిండి కలిపి పేస్టులా చేసుకోవాలి. ఈ ప్యాక్ను ముఖం అంతా అప్లు చేసి.. ఒక 15 నిమిషాలు ఉంచాలి. ఇలా వారంలో రెండుసార్లు చేసినా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
అరటి పండు-అవకాడో: అరటి పండు, అవకాడో కూడా చర్మానికి ఎంతో మంచి పోషణను అందిస్తాయి. ఈ రెండింటిని గుజ్జుల చేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ను ముఖం, మెడకు మొత్తం అప్లు చేయాలి. ఈ ప్యాక్ను 20 నిమిషాల పాటు ఉంచుకొని తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్యాక్ చర్మాన్ని హైడ్రేట్గా, మృదువుగా ఉంచుతుంది.