02-03-2025 12:00:00 AM
ఆఫీసులో పనులెన్ని ఉన్నా... కొన్నిసార్లు ఏకాగ్రత కుదరదు. ఇంటి పనిలోనూ మనసు పెట్టలేం. తీవ్ర ఆలోచనలతో ఒత్తిడికి గురవుతుంటాం. ఇటువంటి సమయాల్లో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు.
* రోజులతరబడి తీరిక లేకుండా పెట్టే పరుగులు మెదడును ప్రభావితం చేస్తాయి. దైనందిన జీవితాన్ని ఇది అనాసక్తిని కలిగిస్తుంది. అప్పటివరకు క్రమశిక్షణగా పనిచేసిన శరీరం, మెదడు పూర్తిగా మొరాయిస్తాయి. దీన్ని దాటాలంటే మన భావోద్వేగాలకు అక్షరరూపమివ్వాలి. దీంతో ఒత్తిడి దూరమవుతుంది. ఈ అలవాటుతో ప్రతికూల ఆలోచనలు దూరమవుతాయి.
* అలసినప్పుడు పనికి బ్రేక్ ఇచ్చినట్లే, మనసుకూ విశ్రాంతినివ్వాలి. మెదడును సమన్వయం చేయడానికి ఇది సాయపడుతుంది. ఈ బ్రేక్లో చిత్రకళ లేదా పాడటం వంటి అలవాట్లను సాధన చేయాలి. ఈ అభిరుచులు మనసుకు హాయిగా అనిపిస్తాయి. ఉత్సాహాన్ని నింపుతాయి.