19-03-2025 06:54:00 PM
ఎస్సై అజయ్ కుమార్...
నడిగూడెం: సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అజయ్ కుమార్ అన్నారు. స్థానిక మండల సమాఖ్య కార్యాలయంలో మానవ అక్రమ రవాణా, లైంగిక వ్యాపారం సైబర్ ఆధారిత అక్రమ రవాణా వంటి అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి గుర్తు తెలియని వాళ్ళతో ఫోన్ లో చెప్పిన మాటలకు మోసపోవద్ధన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రామలక్ష్మి, మహిళా సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.