calender_icon.png 14 March, 2025 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్

14-03-2025 12:32:32 AM

నారాయణపేట. మార్చి 13.(విజయక్రాంతి) రానున్న తీవ్ర ఎండాకాలంలో వడదెబ్బ సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు గురువారం నారాయణపేట జిల్లా కలెక్టర్ విసి హాల్లో వాతావరణం మార్పులు వేసవికాలం ఎండ తీవ్రత వడదెబ్బ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వ హించారు. ఎండాకాలంలో ప్రతి ఒక్కరు ప్రయాణాలలో త్రాగునీరు వెంట తీసుకెళ్లాలన్నారు. ఎండ తగలకుండా తగు జాగ్రత్త తీసుకోవాలన్నారు. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని ఐఎండి సూచనలు పాటించాలన్నారు.

ముఖ్యంగా చిన్నారులు మహిళలు వృద్ధులు గర్భిణీలు ఎండ పట్ల తగు జాగ్రత్త వహించాలన్నారు. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఉపయోగించాలని నిమ్మరసం మజ్జిగ పండ్ల రసాలు వంటి ఇంట్లో తయారు చేసిన పానీయాలు కొద్దిగా ఉప్పు కలిపి త్రాగాలన్నారు. పుచ్చకాయ, కర్బూజా, ఆరెంజ్, ద్రాక్ష, పైనాపిల్, దోసకాయ, పాలకూర లేదా ఇతర స్థానికంగా లభించే పండ్లు కూరగాయలు వంటి అధిక నీటి పరిమాణం గల సీజనల్ పండ్లు కూరగాయలు తినాలన్నారు. సన్నని వదులుగా లేత రంగులో ఉండే కాటన్ వస్త్రాలను ధరించాలని తలను కప్పుకోవాలని సూర్య రష్మి తగలకుండా గొడుగు టోపీ టవల్ వాడాలన్నారు.

అనారోగ్యంగా భావిస్తే విపరీతమైన వేడి సమయంలో చల్లని ప్రదేశానికి వెళ్లి ద్రవపదార్థాలు తాగాలి. వడదెబ్బ అనేది మెడికల్ ఎమర్జెన్సీ కావున అయోమయం గందరగోళం ఆందోళన చిరాకు మూర్ఛ లేదా కోమ వంటివి పెద్దలలో కలుగుతాయని, శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల వరకు ఉండి తలనొప్పి ఆందోళన, వికారం, వాంతులు, హృదయ స్పందన పెరగడం వంటివి కలుగుతాయన్నారు. కూలీలు పని ప్రదేశంలో చల్లని త్రాగునీటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్మికులు నేరుగా సూర్య రష్మికి గురికాకుండా జాగ్రత్త వహించాలన్నారు. కార్మికులకు కూలీలకు షెడ్డు ఏరియాలో ఏర్పాటు చేయాలన్నారు.

మీ ఇంటిని చల్లగా ఉంచండి షెటర్లు లేదా చలువ పందిల్ల ను ఉపయోగించండి. రాత్రివేళ కిటికీలను తెరవాలి. పగటిపూట దిగువ అంతస్తులలో ఉండడానికి ప్రయ త్నించాలని శరీరాన్ని చల్లబరచటానికి ఫ్యాన్, తడి బట్టలను ఉపయోగించాలన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి మూడు గంటల వరకు ఎండలో బయటకు రాకూడదనీ ఇలాంటి జాగ్రత్తలు వేసవిలో తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం దీనికి సంబంధించిన గోడపత్రికను విడుదల చేశా రు. ఈ కార్యక్రమంలో ట్రైని కలెక్టర్ గారిమా నరుల, డి.ఎం. హచ్. ఓ.సౌభాగ్య లక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.