జిల్లా జడ్జి రాధిక...
నిర్మల్ (విజయక్రాంతి): చదువుకోవడం ద్వారానే సమాజాన్ని తెలుసుకోగలుగుతారని జిల్లా జడ్జి రాధిక అన్నారు. పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో బుధవారం బేటి పడావో బేటి బచావో కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలకు చదువు బాలికల రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని చిన్నతనంలో పెళ్లిళ్లు చేసుకోవద్దని ఆడపిల్లల రక్షణకు ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజ్యాంగం కల్పించిన చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి మురళి, సిబ్బంది జ్యోతి, శైలజ తదితరులు ఉన్నారు.