మెదక్ ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డి
మెదక్, జూలై 14 (విజయక్రాంతి): ప్రజలకు పోలీసులు జవాబుదారీగా పనిచే యాలని మెదక్ జిల్లా ఎస్పీ డీ ఉదయ్కుమా ర్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాలోని అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, రేగోడు పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు కేసులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పోలీసు లు బాధ్యతగా పని చేయాలని, ప్రజా ఫిర్యాదులలో ఎలాంటి జాప్యం చేయకుండా తక్ష ణమే స్పందించాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి వారి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో గస్తీ వాహనాలను నిరంతరం తిప్పాలని తెలిపారు. కార్యక్రమం లో మెదక్ డీఎస్పీ రాజేశ్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.