calender_icon.png 23 September, 2024 | 4:38 AM

పర్యాటక శాఖ ప్రమోషన్‌లో భాగమవ్వండి

23-09-2024 02:55:07 AM

యువతకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి పిలుపు

హైదరాబాద్ టు సాగర్ బుద్ధవనం వరకు బైక్ ర్యాలీ

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ పర్యాటక ప్రాంతాల ప్రమోషన్స్‌లో యువత భాగస్వాములు కావాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు పిలుపునిచ్చారు. చారిత్రక వారసత్వ కట్టడాలు, ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు, ప్రకృతి,  వన్యప్రాణులు, సాహస యాత్రలకు అనువైన ఎన్నో ప్రాంతాలు తెలంగాణలో ఉన్నాయని, వాటిని సందర్శించి ప్రాచుర్యం కల్పించాలని యూట్యాబర్స్, సోషల్ మీడి యా ఇన్‌ఫ్ల్యూయెన్సర్లను కోరారు.

అంతర్జాతీయ పర్యాటక వారోత్సవాల్లో భాగంగా నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం థీమ్ పార్కుకు విస్తృత ప్రచారం కల్పించేందుకు చేపట్టిన రైడ్ టు నిర్వాణ బైక్ ర్యాలీని పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డితో కలిసి మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నాగార్జున సాగర్ బుద్ధవనం వరకు సాగింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ హైదరాబాద్ బైక్ రైడర్స్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ర్యాలీలో రైడర్స్ భారీ ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రకాశ్ రెడ్డి, పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.