calender_icon.png 25 September, 2024 | 5:55 AM

జనగామ డీసీసీ పదవిపై బీసీల గురి

25-09-2024 01:09:03 AM

  1. మండలాలవారీగా రహస్య సమావేశాలు
  2. బీసీల మద్దతు కూడగడుతున్న కిరణ్‌గౌడ్
  3. కొమ్మూరి నాయకత్వంపై చల్లారని మంటలు

జనగామ, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): జనగామ కాంగ్రెస్‌లో రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయి. కొన్ని రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డిపై కొందరు నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు చేస్తుండగా.. ఇదే అదనుగా కొందరు నేతలు డీసీసీ కుర్చీని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా పలు మండలాల కార్యకర్తలు కొమ్మూరిని డీసీసీ పదవి నుంచి తప్పించాలని ఏకంగా గాంధీభవన్‌లో హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలను కొందరు నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ క్ర మంలో ఆయనను తప్పిస్తే డీసీపీ అధ్యక్ష ప దవి ఇంకెవరికి ఇస్తారనేది ప్రశ్నార్థకంగా మా రింది.

ఈ కుర్చీ కోసం స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్‌చార్జిగా ఉన్న సింగపురం ఇందిర, పాలకుర్తి ఇ న్‌చార్జిగా ఉన్న ఝాన్సీరెడ్డి ప్రయత్నా లు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదే తరుణం లో తాజాగా బీసీ నినాదం తెరపైకి వస్తో ంది.

జనగామ డీసీసీ అధ్యక్ష పదవిని బీసీల కే కేటాయించాలని ఆ వర్గానికి చెందిన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. బీసీలందరినీ చేర్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ నా గపురి రాజలింగంగౌడ్ కుమారుడు, కాం గ్రెస్ జిల్లా నేత నాగపురి కిరణ్‌గౌడ్ ఏకం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఝాన్సీరెడ్డి సమాలోచనలు

మొన్నటి వరకు డీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించిన ఝాన్సీరెడ్డి సమాలోచన చేస్తున్నట్లు తెలిసింది. పాలకుర్తి నియోజకవర్గంలోని కార్యకర్తలు డీసీసీ అధ్యక్ష పదవి తీసుకోవద్దని అభిప్రాయాలు వెల్లిబుచ్చినట్లు సమాచారం. ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉండగా.. ఆమె కోడలు యశస్వినిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు.

కానీ పార్టీ వ్యవహారాలన్నీ ఝాన్సీరెడ్డే చూసుకుంటున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి దక్కితే పాలకుర్తి నియోజకవర్గానికి దూరమవుతారని, పార్టీ బలహీనపడుతుందని వాదిస్తున్నారు. దీంతో ఈ అంశంపై ఝాన్సీరెడ్డి సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తున్నది. 

రేసులో నాగపురి

డీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకే ఇవ్వాల న్న డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో తెరపైకి నాగపురి కిరణ్‌గౌడ్ పేరు వస్తోంది. కిరణ్‌గౌడ్ తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా కాంగ్రెస్ నుంచి ప్రాతినిథ్యం వహిం చారు. జనగామ నియోజకవర్గంలోని పాత చేర్యాల నియోజకవర్గంతో పాటు జనగామలోనూ నాగపురి కుటుంబానికి సొంతంగా కేడర్ ఉంది.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిరణ్‌గౌడ్ బీఆర్‌ఎస్‌లో ఉండగా ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కేటీఆర్, హరీశ్‌రావు ఆయనను బుజ్జగించి పల్లాకు టికెట్ కేటాయించారు. పల్లా గెలుపులో కిరణ్‌గౌడ్ కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన హస్తం పార్టీలో చేరారు.

దాదాపు పదేళ్లుగా ఆయన వేలాది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడంతో పాటు వ్యక్తిగతంగా వేలాది మంది కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. నిత్యం అన్ని మండలాల్లో పర్యటిస్తూ ఇప్పటికీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీసీలకు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లోనూ కిరణ్‌గౌడ్ పాల్గొంటూ వస్తున్నారు.

జనగామలో డీసీసీ అధ్యక్ష పదవి నుంచి కొమ్మూరిని తొలగించాలని డిమా ండ్ వినిపిస్తున్న నేపథ్యంలో కిరణ్‌గౌడ్ తనకు పదవి దక్కేలా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అన్ని మండలాల నుంచి కార్యకర్తల మద్దతు కూడగట్టుకోవడమే కాకు ండా బీసీలను ఏకం చేస్తున్నారు. తన తం డ్రి రాజలింగంగౌడ్‌కు బడా నేతలతో పరిచయాలు ఉండడంతో హైకమాండ్ మంతనాలు జరుపుతున్నారు.

తాజాగా ఉమ్మడి వరంగల్ ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీ నివాస్‌రెడ్డి దగ్గరికి తండ్రిని వెంటపెట్టుకుని నాగపురి కిరణ్‌గౌడ్ వెళ్లారు. తన బయోడే టా సమర్పించి డీసీసీ అధ్యక్ష పదవికి సహకరించాలని కోరారు. మరోవైపు తన పేరును పరిశీలించాలని రాష్ట్ర హైకమాండ్‌ను ఆయన కోరినట్లు తెలిసింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ సహకారం తీసుకుంటున్నారు.