01-04-2025 02:42:59 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): మహాత్మ జ్యోతిబా ఫులే బీసీ గురుకులాలలో 2025 - 26 విద్యా సంవత్సరానికి 6 నుండి 9 వ తరగతి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్ లాక్ సీట్ల భర్తీ కోసం దరఖాస్తు గడువు ఏప్రిల్ 6 వరకు పొడిగించినట్లు గురుకులాల జిల్లా కన్వీనర్ శ్వేత సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రవేశాల గడువు మార్చి 31 వరకు ప్రకటించినప్పటికీ గురుకుల ఉన్నతాధికారుల ఆదేశానుసారం దరఖాస్తు గడువు పొడిగించినట్లు తెలిపారు.అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.