calender_icon.png 22 October, 2024 | 5:41 AM

గవర్నర్‌తో బీసీ కమిషన్ భేటీ

22-10-2024 01:48:03 AM

హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించేందుకు జరగనున్న అన్ని కులాల సామాజిక, ఆర్థిక, రాజకీయ సమగ్ర సర్వే షెడ్యూల్ వివరాలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు వివరించినట్టు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. సోమవారం రాజ్‌భవన్‌లో సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మితోపాటు బీసీ కమిషన్ అధికారులు, డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి సతీశ్‌కుమార్, చైర్మన్ వ్యక్తిగత క్యాదర్శి జీ శ్రీనివాస్ మర్యాద పూర్వకంగా కలిశారు.

కమిషన్ ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు, సమగ్రంగా సేకరించిన కులాల వివరాలను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు నిరంజన్ పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 8 వరకు ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తామని తెలిపారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కులాలవారీగా సమగ్రంగా వివరాలు సేకరిస్తామని వెల్లడించారు.