calender_icon.png 22 September, 2024 | 9:41 PM

డిజెఎఫ్ మండల అధ్యక్షులుగా బత్తుల సతీష్ బాబు ఎన్నిక

22-09-2024 07:24:10 PM

మందమర్రి,(విజయక్రాంతి): డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మండల కమిటీ అధ్యక్షులుగా బత్తుల సతీష్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో బత్తుల సతీష్ బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా బుంగ సురేందర్, ప్రధాన కార్యదర్శిగా పెండ్యాల గౌతం చారి, కోశాధికారిగా భూమన్న, ఉపాద్యక్షులుగా పారుపల్లి శివరామకృష్ణ,కాగితం శ్రీనివాస్, కార్యదర్శిగా మాదంశెట్టి సురేష్ లు నియమితులైనారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బత్తుల సతీష్ బాబు మాట్లాడుతూ డిజెఎఫ్ అభివృద్ధికి కృషి చేస్తానని, జర్నలిస్టుల సంక్షేమానికి నిరంతరం ముందుండి పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోల శ్రీనివాస్, ఉత్తర తెలంగాణ ఇంచార్జ్ పార్వతి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు మోకెనపల్లి బద్రి, ప్రధాన కార్యదర్శి బర్ల తిరుపతి లు పాల్గొన్నారు.